Vodafone: VI 5జీ వచ్చేసింది.. 100 నగరాలకు విస్తరణ!

Vodafone: ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్ ఇప్పటికే 5జి నెట్వర్క్ లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ రేసులో వొడాఫోన్ ఐడియా (VI) చాలా వెనుకబడి ఉంది. 4జీ నెట్వర్క్తోనేే ఇంకా కొనసాగుతోంది. అయితే ఇప్పుడిప్పుడే వీఐ ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు 5జీ నెట్వర్క్ ను లాంచ్ చేసింది. ఈనెల ముంబైలో రెండో వారంలో ట్రైల్ స్టార్ట్ చేసింది.
ఇందులో భాగంగానే అక్కడ పూర్తిస్థాయిలో 5G నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వచ్చే నెల అంటే ఏప్రిల్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, పాట్నా, మైసూర్, చండీగఢ్, వంటి ప్రాంతాల్లో తమ 5జి నెట్వర్క్ ను లాంచ్ చేస్తామని వోడాఫోన్ ఐడియా కంపెనీ తెలిపింది. దీంతోపాటు త్వరలో మహారాష్ట్ర, చెన్నై, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో 5G నెట్వర్క్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 5జి నెట్వర్క్ విభాగంలో అందుబాటులోకి వచ్చిన జియో, ఎయిర్టెల్ కంపెనీలకు ఇది పోటీగా నిలవనుంది. అయితే ఇప్పుడు 5జి నెట్వర్క్ పెట్టడం వల్ల తమ యూజర్లు ఇతర నెట్వర్క్ లకు పోర్ట్ అయ్యే సంఖ్య తగ్గుతుందని వీఐ భావిస్తోంది. కాగా వచ్చే మూడేళ్లలో 17 టెలికం సర్కిల్స్ లోని 100 నగరాలకు తమ 5జి నెట్వర్క్ ను విస్తరిస్తామని కంపెనీ చెప్తోంది. ఇదిలా ఉంటే విఐ తన 5జి నెట్వర్క్ ను ప్రారంభించడంతో.. తన రీఛార్జ్ ప్లాన్ లపై ఆఫర్లు ప్రకటించింది.
ప్రారంభ ఆఫర్లలో భాగంగా.. కేవలం 299 రూపాయలకే 5జి అన్లిమిటెడ్ డేటా అందిస్తోంది. ఈ ధరతో రీఛార్జ్ చేసుకున్న వోడాఫోన్ ఐడియా యూజర్లు 5జి అన్లిమిటెడ్ డేటాను పొందుతారు. దీని బట్టి చూస్తే ఇతర టెలికాం సంస్థల కంటే ఇది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అనే చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ లో యూజర్లు అన్లిమిటెడ్ కాల్స్ ప్రయోజనం పొందుతారు. అలాగే 100 ఎస్ఎంఎస్లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 1gb 4జి డేటాతో పాటు 5జి డేటాను యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు.