Concentration: ఏకాగ్రత పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ యోగాసనాలు వేయండి

Concentration: ప్రతీ రోజు కొన్ని యోగాసనాలు చేయడం వల్ల మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. తడసాన, సర్వాంగసాన, అధో ముఖ స్వనాసనం వంటి ప్రత్యేకమైన ఆసనాలు మెదడుకు రక్త ప్రసరణను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. మన మెదడును చురుకుగా, ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి యోగాసనాలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే యోగాసనాలు వేయడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
పర్వతాసనం
ఈ ఆసనం నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ప్రశాంతంగా ఉంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం వేసే వారు ముందుగా మీ పాదాలను తుంటి వెడల్పుతో వేరుగా ఉంచి, చేతులను శరీరానికి పక్కగా ఉంచాలి. లోతుగా శ్వాస తీసుకుంటూ చేతులను తలపైకి ఎత్తి పైకి చాచాలి. నెమ్మదిగా గాలిని వదులుతూ, భుజాలను క్రిందికి దించి, 30 సెకన్ల పాటు లోతుగా శ్వాస తీసుకోనివ్వాలి. ఆ తర్వాత ఆసనం శరీర భంగిమను సరిచేయడంతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు.
సర్వాంగసనం
ఈ ఆసనం అన్ని అనారోగ్య సమస్యలకు బాగా ఉపయోగపడుతుంది. మెదడుకు రక్త ప్రసరణను బాగా కావడంతో పాటు పనితీరు కూడా మెరుగుపడుతుంది. మొదట వీపుపై పడుకుని, మీ కాళ్లు, తుంటి, కింది వెన్నెముకను పైకి లేపి, చేతులతో నడుమును ఆసరాగా ఉంచాలి. ఆ తర్వాత, కాళ్లను నిటారుగా పైకి ఉంచి, కాలి వేళ్లను ఆకాశం వైపు చూపించాలి. ఇలా ఒక 30 సెకన్ల పాటు ఉంచితేనే జ్ఞాపకశక్తిని మెరుగుపడుతుంది. అలాగే నిద్రలేమి తగ్గడంతో పాటు ఆందోళన తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
అధో ముఖ స్వనాసన
ఈ ఆసనం రక్త ప్రసరణను పెంచి మానసిక అలసటను తొలగిస్తుంది. మొదట మీ చేతులు, మోకాళ్లపై నిలబడి ఆ తర్వాత తుంటిని కొద్దిగా పైకి ఎత్తి, తల కిందికి ఉండేలా ‘విలోమ V’ ఆకారాన్ని ఏర్పరచాలి. మీ వెన్నెముకను నిటారుగా ఉంచి మీ మడమలు నేలను తాకేలా చూసుకుంటూ.. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. ఇలా ఒక 30 సెకన్ల పాటు చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
పద్మాసనం
ఏకాగ్రత, ధ్యానాన్ని పెంచడంలో ఈ పద్మాసనం బాగా ఉపయోగపడుతుంది. మొదట మీ పాదాలను ఎదురుగా ఉన్న తొడలపై ఉంచి, అడ్డంగా కూర్చోవాలి. ఇవి మీ వెన్నెముకను నిటారుగా ఉంచి, మీ చేతులను చిన్ ముద్రలో ఉంచాలి. కళ్లు మూసుకుని 2 నుంచి 5 నిమిషాల వరకు శ్వాస తీసుకుంటే ఏకాగ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
త్రతక
ఈ యోగాసనం ఏకాగ్రత, దృష్టిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒక చోట హాయిగా కూర్చోని కొవ్వొత్తి మంటను కనురెప్పలు వాల్చకుండా స్థిరంగా చూడాలి. మీ కళ్లలో నీళ్లు కారేంత వరకు అలా చూస్తూ ఉంటే మీ ఏకాగ్రత పెరుగుతుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Viral Video : వీడికి ఎన్ని గుండెలు.. 15అడుగుల కొండచిలువతో చిన్నారి ఆట