Health Issues: వీటిని కుంభకర్ణుడిలా తింటున్నారా.. అనారోగ్య బారిన పడటం ఖాయం

Health Issues: పండ్లలో రారాజు మామిడి పండు అంటే చాలా మందికి ఇష్టం. సీజన్లో మాత్రమే లభిస్తాయని తర్వాత దొరకవని చాలా మంది పిచ్చిగా తింటారు. అయితే ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ దొరికాయని అధికంగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికంగా మామిడి పండ్లను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
బరువు పెరగడం
మామిడి పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి. తినే కొలది వీటిని తినాలనిపిస్తుంది. అయితే వీటిలో సహజసిద్ధమైన చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. ఒక మధ్య స్థాయి మామిడి పండులో సుమారు 150-200 కేలరీలు ఉంటాయి. రోజుకు రెండు మామిడి పండ్లు తింటేనే 300 నుంచి 400 కేలరీలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇతర ఆహారంతో కలిపి ఈ కేలరీలు పెరుగుతాయి. అయితే క్రమం తప్పకుండా అధికంగా మామిడి పండ్లు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం
మామిడి పండ్లలో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) మధ్యస్థంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లను అతిగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా అతిగా తింటే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి, దీర్ఘకాలంలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహా మేరకు మాత్రమే పరిమిత పరిమాణంలో మామిడి పండు తీసుకోవాలి.
జీర్ణ సమస్యలు
మామిడి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, అతిగా తింటే కొందరికి జీర్ణ సమస్యలు వస్తాయి. అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా లేదా మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
అలర్జీలు
కొంత మందికి మామిడి పండ్లు వల్ల అలర్జీలు వస్తాయి. మామిడి కాయ తొక్కలో “ఉరుషియోల్” అనే రసాయనం ఉంటుంది. దీనివల్ల సున్నితత్వం ఉన్నవారికి చర్మంపై దద్దుర్లు, దురద, నోటి చుట్టూ వాపు రావచ్చు. దీన్ని “మామిడి డెర్మాటిటిస్” అంటారు. పండు లోపల కూడా కొన్ని రకాల ప్రోటీన్లు కొంత మందికి అలర్జీ వచ్చేలా చేస్తాయి.
పంటి సమస్యలు
మామిడి పండ్లలో సహజ చక్కెరలు ఉండటం వల్ల వాటిని తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోకపోతే దంత క్షయం, పురుగులు పడటం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు మామిడి పండ్లు ఎక్కువగా తింటే ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి.
రసాయనాల ప్రభావం
మామిడి పండ్లు కొన్ని రకాల మందులతో పండిస్తారు. వీటివల్ల మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Vitamin B12 : విటమిన్ బి12 కేవలం నాన్ వెజ్ లోనే ఉంటుందా..ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారంటే ?
-
Mobile: రోజుకి 4 గంటలకు మించి మొబైల్ చూస్తున్నారా.. ఈ వార్నింగ్ మీ కోసమే
-
Weight Loss: వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం ఎలా?
-
Health Issues: పెంపుడు జంతువులతో పిల్లలను ఆడుకోనిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
-
Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే
-
Eat this food: రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుకుంటున్నారా.. ఈ ఫుడ్ తీసుకోండి
-
Mango : ఒక్కో రాష్ట్రానిది ఒక్కో రుచి.. భారతదేశంలో మామిడిని ఇలా కూడా తింటారా?