Chenab: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Chenab: భారత ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో చినాబ్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ భారతదేశ రైల్వే రవాణా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ వంతెనపై రైలు పరుగులు పెడుతోంది. 132 ఏళ్ల క్రితం కశ్మీర్ రాజు ఈ రైలు నిర్మాణం చేపట్టాలని అనుకున్నారు. అయితే దీని నిర్మాణానికి 42ఏళ్ల క్రితం బీజం పడగా ఇప్పుడు ఆ కల నిజం అయ్యింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపుగా రూ.46 వేల కోట్లు అయినట్లు తెలుస్తోంది. మొదట స్టీమ్ ఇంజిన్ రైలును నడిపించేందుకు భావించారు. అయితే ఇప్పుడు వందే భారత్తో ప్రారంభించారు. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి స్టార్ట్ చేశారు. అయితే ఈ రైల్వే బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
5. The Chenab Bridge – world’s highest railway arch bridge.
– Length: 1.3 Km
– Height: 359 m (35 m higher than Eiffel Tower)
– Steel welding: More than 600 Km, that is more than the length of Jammu to Delhi Railway track. pic.twitter.com/fjlKCIPGjO— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 5, 2025
చినాబ్ బ్రిడ్జ్ పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తులో ఉంటుంది. దీన్ని నదీ తలం నుంచి సుమారు 359 మీటర్ల (1,178 అడుగులు) ఎత్తులో నిర్మించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఇదే. మొత్తం ఈ వంతెన పొడవు 1.315 కిలోమీటర్లు. ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టులో ఒక భాగంగా నిర్మించారు. భారీ ఉక్కు ఆర్చ్ నిర్మాణంతో దీన్ని నిర్మించారు. ఈ వంతెనకు దాదాపుగా 28,000 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించి నిర్మించారు. ఈ ఉక్కు ప్రత్యేకంగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎక్కువగా భూకంపాలకు గురవుతుంది. అయితే వీటిని తట్టుకునే విధంగా నిర్మించారు. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రత వరకు వచ్చే భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు.
ఈ ప్రాంతంలో గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా వంతెనను డిజైన్ చేశారు. వంతెనపై బలమైన గాలుల నుండి రైళ్లను రక్షించడానికి ప్రత్యేక విండ్ షీల్డ్ లను కూడా అమర్చారు. వంతెనపై నిరంతరం పర్యవేక్షించడానికి సెన్సార్లు, భద్రతా కెమెరాలు, ఇతర అత్యాధునిక సాంకేతికతలు ఏర్పాటు చేశారు. ఉగ్రవాద బెదిరింపుల దృష్ట్యా, దీనికి అదనపు భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణం జమ్మూ కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలను కలుపుతుంది. ఇది ఆర్థిక అభివృద్ధికి, పర్యాటకానికి, ఉద్యోగ అవకాశాలకు దోహదపడుతుంది. శ్రీనగర్తో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించడంలో ఈ వంతెన కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చూడండి: ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే