Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్

Jyoti Malhotra : హర్యానాలోని హిసార్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యోతి భారత సైనిక చర్య ‘ఆపరేషన్ సింధూర్’, సైన్యానికి సంబంధించిన అనేక రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు పంపిందని ఆరోపణలు ఉన్నాయి. విచారణలో జ్యోతి తాను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్తో కూడా సంబంధంలో ఉన్నట్లు ఒప్పుకుంది. ఈ క్రమంలోనే అసలు ఎవరీ జ్యోతి మల్హోత్రా ఆమె గురించి తెలుసకుందాం.
జ్యోతి మల్హోత్రా హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందినది. ఆమె కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో చదివారు. ఆమె ఒక యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్లో జ్యోతికి 132 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. యూట్యూబ్లో ఆమెను 377 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. జ్యోతి ట్రావెల్ వ్లాగ్లు చేస్తుంది. ఆమె ఛానెల్ పేరు ‘ట్రావెల్ విత్ జో’. ఆమె ప్రజల్లో బాగా పాపులారిటీ పొందింది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను చూస్తే జ్యోతికి ప్రయాణాలు అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది. ఆమె దేశ విదేశాలు తిరిగింది. ఆమె తరచుగా తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
Read Also:Mission Impossible The Final Reckoning Review: మిషన్ ఇంపాసిబుల్: ద ఫైనల్ రెకనింగ్ రివ్యూ
గత ఏడాది జ్యోతి పాకిస్తాన్ పర్యటన
గతేడాది జ్యోతి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె పాక్ హైకమిషన్ను కూడా సందర్శించింది. అక్కడ ఆమె పాకిస్తాన్లోని పలువురు ఉన్నతాధికారులను కూడా కలిసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్లో తెలియజేసింది. కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, పాకిస్తాన్ హైకోర్టులో @navankurchaudharyని కలిశానని, ఇద్దరం హర్యానాకు చెందిన వాళ్లం కావడంతో ప్రయాణికులతో దేశీ శైలిలో మాట్లాడడం సంతోషంగా ఉందని తెలిపింది. వ్లాగ్ను ఈరోజే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానని కూడా చెప్పింది. @jaanmahal_video పాజీతో చాలా కాలంగా అనుబంధం ఉందని, తాము సిక్కు యాత్రికులుగా కలిసి పాకిస్తాన్ ప్రయాణించామని, వారిని కలవడం నిజంగా అద్భుతంగా ఉందని పేర్కొంది.
పాక్లోని 5000 ఏళ్ల నాటి ఆలయాన్ని సందర్శించిన జ్యోతి
దీంతో పాటు జ్యోతి పాకిస్తాన్లో ఉన్న 5000 ఏళ్ల నాటి ఆలయాన్ని కూడా సందర్శించింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపెద్ద హిందూ దేవాలయంలో ఒక భారతీయ అమ్మాయి… కన్నీళ్ల ఈ పవిత్ర కొలనులో స్నానం చేస్తే మీ పాపాలు పోతాయని రాసుకొచ్చింది. కటాస్ రాజ్లోని ఈ కొలను గురించి హిందువుల నమ్మకం ఇదేనని తెలిపింది. ఈ వీడియో ఆలయ దృశ్యాలను, దాని పరిసర ప్రాంతాల అందాలను చూపించింది. వీడియోలో జ్యోతి పూజలు చేస్తూ కనిపించింది.
Read Also:Phone Battery Drain :మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ 5 సింపుల్ చిట్కాలు పాటించండి
-
Mahindra Bolero : టయోటా ఫార్చ్యూనర్కు పోటీగా మహీంద్రా బొలెరో బోల్డ్.. ప్రత్యేకతలు ఇవే!
-
Viral Video : రైలు ఎక్కబోయి మరొకరి ప్రాణాలకు ముప్పు తెచ్చిన అంకుల్.. షాకింగ్ ఘటన!
-
Viral Video : పెళ్లి పందిట్లో ఎద్దు వీరంగం.. మ్యూజిక్కు రెచ్చిపోయి వేసిన డ్యాన్స్ చూస్తే షాకే
-
Obesity in India : పిల్లలను కూడా వదలని ఊబకాయం.. వచ్చే 25 ఏళ్లలో అందరికీ పొట్టలుంటాయట
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్
-
IPL 2025 : బీసీసీఐ నిర్ణయం పై మండిపడుతున్న అభిమానులు..కోల్కతా ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు!