Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఐపీఎల్కి ఆటంకమా!
Operation Sindoor: జమ్మూకశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్లు మృతి చెందారు. సంతోషంగా కుటుంబ సభ్యులు, భాగస్వాములతో గడుపుదామని వెళ్లిన వారు ఉగ్రవాదులకు బలి అయ్యారు. ఈ ఉగ్రదాడుల్లో కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు.

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి పాక్పై భారత్ ప్రతీకార చర్య తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్పై వైమానిక దాడులు నిర్వహించింది. అందరూ నిద్రపోతున్న సమయంలో భారత్ మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ఇండియన్ త్రివిధ దళాలు కలిసి పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. అయితే ప్రస్తు్తం ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగతోంది. ఈ ఆపరేషన్ సిందూర్ వల్ల ఐపీఎల్కు ఆటంకం కలుగుతుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా స్పందించింది. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్కు ఎలాంటి ఆటంకం లేదని తెలిపింది. ఎప్పటిలాగానే మ్యాచ్లు జరుగుతాయని వెల్లడించింది.
Also Read: Operation Sindoor: పాక్లో మొదలైన యుద్ధ భయం.. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్టేనా?
ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్లు మృతి చెందారు. సంతోషంగా కుటుంబ సభ్యులు, భాగస్వాములతో గడుపుదామని వెళ్లిన వారు ఉగ్రవాదులకు బలి అయ్యారు. ఈ ఉగ్రదాడుల్లో కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఉగ్రవాదులు పక్కా ప్లానింగ్తో మతం ఏదని అడిగి మరి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ పాక్పై వైమానిక దాడులు చేసింది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక అక్రమిత కాశ్మీర్లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. భారత త్రివిధ దళాలు వైమానిక దాడులను చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ఈ దాడుల్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. ప్రతీకారంగా అర్థ రాత్రి సమయంలో దాడి చేసింది. పహల్గాంలో చనిపోయిన అమాయకుల ఆత్మకు శాంతి కలిగేలా భారత్ ఈ వైమానిక దాడికి పాల్పడింది. ఉగ్రవాదాలకు సంబంధించిన తొమ్మిది స్థావరాలను భారత్ నాశనం చేసింది. ముఖ్యంగా బహవల్పూర్ను టార్గెట్ చేసి మెరుపు దాడులు నిర్వహించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్కు చెందిన హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్కు చెందిన మదర్సాలే స్థావరాలను భారత్ ఆర్మీ నాశనం చేసింది. పహల్గాం దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది.
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025 India Vs Pakistan: ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వేదిక ఎక్కడో తెలుసా?
-
Amit Shah: ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో రెండో రోజు చర్చ.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో చర్చ.. రాజ్ నాథ్ ఏమన్నాడంటే