Delhi Earthquake: ఢిల్లీలో భూకంపం.. ఇంతకీ ఇండియాలో ఎక్కువగా భూకంపం వచ్చే ప్రమాదం ఎక్కడ ఉంది? ఎన్ని జోన్ లు ఉన్నాయి? మరి హైదరాబాద్ సేఫా కాదా?
Delhi Earthquake: ఈ మధ్య ఎక్కువగా భూకంప న్యూస్ లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి ఢిల్లీలో భూమి కంపించి ప్రజలను భయాందోళనలకు గురి చేసింది.

Delhi Earthquake: ఈ మధ్య ఎక్కువగా భూకంప న్యూస్ లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి ఢిల్లీలో భూమి కంపించి ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. అయితే దేశ రాజధానిలో ఈ రోజు ఉదయం 5:36 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తెల్లవారుజామునే భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరిగిలేదట. కానీ ఈ ప్రకంపనలు ప్రజలలో భయాందోళన వాతావరణాన్ని సృష్టించాయి. ఢిల్లీ ఫాల్ట్ IV గా ఉందట. కాబట్టి ఈ ప్రాంతం భూకంప కార్యకలాపాలకు ఎక్కువగా గురవుతుంటుంది. భూకంపం సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఢిల్లీ ఒకటిగా చెబుతున్నారు అధికారులు. ఇక్కడ భూకంప తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది.
భారతదేశంలో భూకంప ప్రాంతాలను ఎన్ని మండలాలుగా విభజించారు?
భూకంపాల తీవ్రత, తరచుగా వచ్చే అవకాశాలను ఆధారంగా చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) భారతదేశాన్ని నాలుగు భూకంప మండలాలుగా విభజించింది. దీని సహాయంతో, భూకంపం సంభవించే ప్రాంతాలలో ప్రమాదం ఎక్కడ ఎక్కువగా, తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలు ఏవి అనే విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే భారతదేశంలోని నాలుగు భూకంప మండలాల్లో జోన్ II, జోన్ III, జోన్ IV, జోన్ V ఉన్నాయి.
మొదటి జోన్లోకి వచ్చే ప్రాంతాలు
జోన్ II తక్కువ భూకంప ప్రమాద ప్రాంతాలలో వస్తుంది. ఇక్కడ భూకంప ప్రమాదం అత్యల్పంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో భూకంపం, గరిష్ట తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9 గా ఉండవచ్చు. జోన్ IIలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, కర్ణాటకలోని బెంగళూరు, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్, ఛత్తీస్గఢ్లోని భిలాయ్, మధ్యప్రదేశ్లోని భోపాల్, తెలంగాణలోని హైదరాబాద్, రాజస్థాన్లోని జైపూర్ మొదలైనవి ఉన్నాయి.
రెండవ జోన్లోకి వచ్చే ప్రాంతాలు
జోన్ III మోస్తరు భూకంప ప్రమాదం ఉన్న జోన్ గా పరిగణించారు. ఇక్కడ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 నుంచి 6 మధ్య ఉండవచ్చు. ఈ జోన్లో బరేలీ, ఆగ్రా, లక్నో, ఉత్తరప్రదేశ్లోని వారణాసి, కర్ణాటకలోని బెల్గాం, పంజాబ్లోని భటిండా, మధ్యప్రదేశ్లోని జబల్పూర్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, గుజరాత్లోని వడోదర మొదలైనవి ఉన్నాయి.
ఢిల్లీ ఏ జోన్లో వస్తుంది?
జోన్ IV అధిక భూకంప ప్రమాదం ఉన్న జోన్ కింద ఉంది. ఇక్కడ భూకంప తీవ్రత 6 నుంచి 6.9 మధ్య ఉండవచ్చు. ఢిల్లీ ఈ జోన్లోకి వస్తుంది. ఇక్కడ భూకంప ప్రమాదం ఎక్కువగా ఉంది. 6 కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు సంభవిస్తే, అది ప్రమాదకరమైన పరిస్థితి. దీంతో అనేక చోట్ల విధ్వంసం దృశ్యాలు కనిపించాయి. అక్కడ భవనాలు పూర్తిగా కూలిపోయాయి. ప్రతిదీ నాశనమైంది. ఇక ఈ భూకంప జోన్ IVలో నైనిటాల్, పిలిభిత్, ఉత్తరాఖండ్లోని రూర్కీ, బీహార్లోని పాట్నా, బులంద్షహర్, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, సిక్కింలోని గ్యాంగ్టక్, పంజాబ్లోని అమృత్సర్ మొదలైనవి ఉన్నాయి.
అత్యంత ప్రమాదకరమైన జోన్
భూకంపాలకు అత్యంత ప్రమాదకరమైన జోన్ V. ఇక్కడ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. ఈ జోన్లో భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్లోని కచ్ ఈ జోన్లోకి వస్తుంది. గతంలో అంటే జనవరి 26, 2001న భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇతర రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్లోని మండి, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, నాగాలాండ్లోని కోహిమా, గుజరాత్లోని భుజ్, మణిపూర్లోని ఇంఫాల్, బీహార్లోని దర్భంగా మొదలైనవి ఉన్నాయి.