Sunrisers: ఐపీఎల్ ఎండింగ్లో అదరగొడుతున్న సన్రైజర్స్.. ఎంత ఆడినా వృథానే
ఐపీఎల్ సీజన్ 2025 ప్లే ఆఫ్స్కు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లేఆఫ్స్ వెళ్లాయి. మిగతా జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లు కూడా నామమాత్రమే.

Sunrisers: ఐపీఎల్ సీజన్ 2025 ప్లే ఆఫ్స్కు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లేఆఫ్స్ వెళ్లాయి. మిగతా జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లు కూడా నామమాత్రమే. ఈ మ్యాచ్లలో గెలిచిన జట్లు బట్టి పాయింట్ల టేబుల్ మారుతుంది. అయితే ఈ సీజన్లో కప్ గెలిచే జట్లులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఈ సీజన్లో సన్ రైజర్స్ జట్టు అదరగొడుతుందని అందరూ భావించారు. కానీ జట్టు మాత్రం ఫ్యాన్స్ను తీవ్ర నిరాశ పరిచింది. స్కోర్ కూడా 300 ప్లస్ కొడుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ సన్రైజర్స్ జట్టు ఈ సీజనల్లో పేలవంగా ఆడింది. అయితే మొదటి నుంచి వరుస మ్యాచ్లో ఓడిపోతూ వచ్చిన సన్రైజర్స్ జట్టు ఎండింగ్లో మాత్రం దూసుకెళ్తుంది. లక్నో జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశను సన్రైజర్స్ కూల్చేసింది. సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో లక్నో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఛాన్స్లు ఉంటాయి. కానీ సన్రైజర్స్ జట్టు లక్నోను ఓడించింది. తాను మాత్రమే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. లక్నో జట్టును కూడా తీసుకెళ్లింది. శనివారం ఆర్సీబీ, సన్రైజర్స్ మధ్య మ్యాచ్ జరగ్గా.. 231 భారీ స్కోర్ కొట్టింది. ఈ లక్ష్య ఛేదనను ఆర్సీబీ సాధించలేకపోయింది. 42 పరుగులతో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. దీంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. మరి ఏ జట్లు టాప్ 2లో ఉంటాయో చూడాలి.
Read Also: మ్యూచువల్ ఫండ్లో దీర్ఘకాలికంగా పెట్టుబడులు ఎందుకు పెడతారు?
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్లో ఉంది. అయితే గురువారం గుజరాత్, లక్నో మధ్య మ్యాచ్ జరగ్గా ఓడిపోయింది. దీంతో ఈ జట్టు టాప్ 2 అవకాశాలు చాలా కష్టంగా మారాయి. ఆర్సీబీ, పంజాబ్ జట్లు బట్టి గుజరాత్ జట్టు టాప్ 2 ప్లేసు ఖరారు అవుతుంది. రాయల్స్ బెంగళూరు జట్టు 17 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. అయితే ఆర్సీబీ లక్నోతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆర్సీబీ జట్టు టాప్ 1లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండింటిలో ఓడిపోతే మాత్రం టాప్ 2 అవకాశం గాల్లో కలిసిపోయినట్లే. పంజాబ్ కింగ్స్ జట్టు 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు ఢిల్లీ, ముంబైతో తర్వాత మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే ఈ రెండింటిలో గెలిస్తేనే 21 పాయింట్లతో టాప్ 2లోకి వెళ్తుంది. వీటిలో ఒక్కటి ఓడిపోయినా కూడా టాప్ 2 ప్లేస్ ఉండదు. ముంబై జట్టు ఒక మ్యాచ్ మాత్రమే ఆడాలి. అది కూడా పంజాబ్తో ఆడాలి. అయితే ఇందులో గెలిస్తే టాప్ 2 అవకాశాలు ఉంటాయి. అదే ఓడిపోతే మాత్రం నాలుగో స్థానంలో ఉంటుంది. అయితే ముంబై జట్టు టాప్ 2లోకి వెళ్లాలంటే మాత్రం అన్ని జట్లు కూడా ఇకపై ఆడే మ్యాచ్లు ఓడిపోవాలి. అప్పుడే ముంబై జట్టుకు టాప్ 2 అవకాశాలు ఉంటాయి.
-
IPL 2025 : నేడే ఎలిమినేటర్ మ్యాచ్.. గెలిచేదెవరు?
-
Surya Kumar Yadav breaks World Record: టీ20ల్లో వరల్డ్ రికార్డును బీట్ చేసిన సూర్య కుమార్ యాదవ్
-
A Cricket match that made History: చరిత్ర సృష్టించిన క్రికెట్ మ్యాచ్.. 2 పరుగులకే ఆలౌట్, 8మంది డకౌట్
-
Mitchell Marsh: ఏం కొట్టుడు అదీ.. మిచెల్ మార్ష్ సెంచరీ తడాఖా చూపించాడు
-
India vs Pakistan ODI: రివెంజ్ తీసుకున్న భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ ఔట్?
-
IND vs PAK: దుబాయ్లో పాక్ను చితక్కొట్టిన భారత్.. విరాట్ వీరోచిత పోరాటం