Viral Video : రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపైనే బండికి నిప్పు.. పిచ్చి వదిలించిన పోలీసులు

Viral Video : ఇటీవల కాలంలో యూత్ పాపులర్ కావడానికి ఎలాంటి పిచ్చి పనులు చేసేందుకు అయినా వెనకాడడం లేదు. రీల్స్ పిచ్చి, లైకుల మోజులో పడి వారికి ఏది సరైంది, ఏది తప్పో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. దీని కోసం ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు మనం ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఈ కోవలోనే అలాంటి మరో వీడియో బయటపడింది. ఒక యువకుడు రైల్వే ట్రాక్పై పిచ్చి పని చేస్తూ పట్టుబడ్డాడు. అది చూసి జనాలు ఆశ్చర్యపోయారు.. ఆలోచనలో పడ్డారు, ఎందుకంటే లైక్స్, వ్యూస్ కోసం ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేదు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని హాపుర్ (Hapur) జిల్లాకు చెందినది. ఇక్కడ చంద్సార్ రైల్వే లైన్పై ఒక మోటార్సైకిల్ టైరుకు పెట్రోల్ పోసి నిప్పు అంటించి ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్నారు. తమ వీడియోను ప్రజల్లో వైరల్ చేయడానికి వారు ఇలా చేశారు. ఈ వీడియో బయటపడగానే చూసిన వారిలో ఆందోళన మొదలైంది. మీడియా వార్తల ప్రకారం, ఆర్పీఎఫ్ హాపుర్ పోలీస్ స్టేషన్లో రైల్వే చట్టంలోని తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ముగ్గురు యువకులను అరెస్టు చేసింది.
Read Also:Alia Kapoor : పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి తనను అలాగే పిలవాలట
ये मनबढ़ रेलवे ट्रैक पर रील बना रहे है, बाइक के टायर में इन्होंने पेट्रोल डाल आग लगा दी.
इन्हें कायदे की इलाज की जरूरत है. pic.twitter.com/s1MiyG55NW
— Priya singh (@priyarajputlive) June 12, 2025
వీడియోలో ఒక మోటార్సైకిల్పై ‘గోస్వామి’ (Goswami) అని రాసి ఉంది. యువకులు మోటార్సైకిల్ను రైలు పట్టాల మధ్య ఇరికించారు. ఆ తర్వాత దాని టైరుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఆ తర్వాత అందరూ కలిసి మోటార్సైకిల్కు యాక్సిలరేటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీనివల్ల వెనుక చక్రం వేగంగా తిరుగుతూ అగ్ని గోళంలా మారింది. ఈ వీడియో రైల్వే ప్రధాన కార్యాలయం మొరాదాబాద్ నుంచి హాపుర్ రైల్వే పోలీసు స్టేషన్ కు పంపగా వారు ఈ యువకులను గుర్తించి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ వీడియో క్లిప్ను ‘ఎక్స్’ (X) సామాజిక మాధ్యమంపై ‘@priyarajputlive’ అనే పేరుతో ఉన్న అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీనికి ఈ అల్లరి మూక రైలు పట్టాలపై రీల్స్ చేస్తున్నారు. మోటార్సైకిల్ టైరులో పెట్రోల్ పోసి నిప్పు అంటించారు, వీరికి సరైన ట్రీట్మెంట్ అవసరం అని రాశారు. ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవాలన్న మోజులో ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయడం జీవితానికే ప్రమాదకరమని, చట్టపరమైన సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
Viral Video : వీడికి ఎన్ని గుండెలు.. 15అడుగుల కొండచిలువతో చిన్నారి ఆట
-
Viral Video : బలికి ముందు యజమానిని పట్టుకొని ఏడ్చిన మేక.. హృదయాన్ని హత్తుకునే దృశ్యం
-
Viral Video: పిల్లలతో ఫుట్బాల్ ఆడిన కాకి.. వీడియో చూశారా?
-
Viral Video : హృదయాలను కదిలించిన ఘటన.. చనిపోయిన యజమాని నుదుటి పై ముద్దు పెట్టిన కొండముచ్చు
-
Viral Video: భార్యాభర్తలు పాలు కాదు.. సిగరెట్ పంచుకోవాలి.. వైరలవుతున్న వీడియో
-
Viral Video: మునిగిపోతున్న జింకపిల్లను రక్షించిన ఏనుగు.. వైరల్ వీడియో