Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?

Andhra Pradesh: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. అయితే నేటితో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావడంతో తల్లికి వందనం డబ్బులను అకౌంట్లోకి వేసింది. తల్లికి వందనం పథకం కింద డబ్బులు అకౌంట్లోకి రూ.15 వేలు జమ చేయనున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు రూల్ మారిపోయింది. తల్లికి వందనం పథకం కింద తల్లుల అకౌంట్లోకి రూ.13 వేలు మాత్రమే వేశారు. మిగతా రెండు వేలు ఇక స్కూల్లకు చెందుతాయి. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పథకం ప్రారంభంలోనే మొదటి విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల తల్లులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చేటప్పుడు ఒక్కో తల్లికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది. కానీ తాజాగా విడుదల చేసిన జీవో (ప్రభుత్వ ఉత్తర్వు)లో మాత్రం తల్లుల ఖాతాల్లో నేరుగా జమయ్యే మొత్తం రూ.13 వేలు మాత్రమేనని పేర్కొంది. మిగిలిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధి, నిర్వహణ నిధులకే వినియోగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకంలో కూడా స్కూళ్ల నిర్వహణ కోసం నిధులను మినహాయించిన విషయం తెలిసిందే. ఈ నిధులు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్న ఖాతాల్లో జమ అవుతాయి.
‘తల్లికి వందనం’ పథకం ద్వారా లబ్ధి పొందడానికి కొన్ని అర్హతా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం తెలిపింది. పట్టణాల్లో నివసించే కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.12 వేలు లోపు ఉండాలి. గ్రామాల్లో నివసించే కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.10 వేలు లోపు ఉండాలి. కుటుంబంలో కనీసం ఒక్కరి పేరు అయినా రేషన్ కార్డులో ఉండాలి. మాగాణి (నీటిపారుదల) భూమి మూడు ఎకరాలలోపు, మెట్ట (బీడు) భూమి 10 ఎకరాలలోపు ఉండాలి. రెండు కలిపి 10 ఎకరాలలోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. వ్యక్తిగత వాహనాలు కార్లు వంటివి ఉండకూడదు. అయితే ట్రాక్టర్లు, ఆటోలు వంటి ఉపాధి కోసం ఉపయోగించే వాహనాలకు మినహాయింపు ఉంటుంది. విద్యుత్ వినియోగం సగటున నెలకు 300 యూనిట్లు మించకూడదు. ఐటీ రిటర్న్లు దాఖలు చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కాదు. అయితే నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు సమయానికి జమ కావాలని ఆయన ఆదేశించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు నిధుల కొరత రాకుండా చూసే బాధ్యతను అప్పగించారు. అలాగే కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, షూస్ అందించనున్నట్లు విద్య శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. అలాగే మధ్యాహ్న భోజనం కోసం డొక్కా సీతమ్మ స్కీమ్ ద్వారా నాణ్యమైన భోజనం అందించనున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
-
Money: రూ.5 నోట్తో రూ.6 లక్షలు.. ఎలా సంపాదించవచ్చు అంటే?
-
Chanakyaniti: ఎలాంటి ప్రదేశాల్లో ఉండకూడదు.. చాణక్య నీతి ఏం చెబుతోంది?
-
APEAPCET: వచ్చేసిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతో ఇలా తెలుసుకోండి
-
AP PGECET 2025: ఏపీ పీజీ సెట్ 2025 పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
GST: జీఎస్టీ కౌన్సిల్ 12 శాతం పన్ను శ్లాబ్ను తొలగిస్తుందా?
-
Money: ఈ ప్లేస్లో పుట్టుమచ్చ ఉంటే.. లెక్కలేనంత ధనం మీ సొంతం