Banking Frauds : సామాన్యులనే కాదు..బ్యాంకులనూ దోచేస్తున్న కేటుగాళ్లు..ఏడాదిలో 3రెట్లు పెరిగిన సైబర్ మోసాలు

Banking Frauds : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బ్యాంకింగ్ రంగంలో మోసాల మొత్తం గత ఆర్థిక సంవత్సరం కంటే మూడు రెట్లు పెరిగింది. లోన్ అకౌంట్స్, డిజిటల్ పేమెంట్స్ కు సంబంధించిన మోసాల వల్ల ఈ పెరుగుదల నమోదైనట్లు ఆర్బీఐ తెలిపింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 122 కేసులను రీక్లాసిఫికేషన్ దీనికి ప్రధాన కారణమని కేంద్ర బ్యాంక్ వెల్లడించింది.
ఆర్థిక సంవత్సరం 2024-25లో పెరిగిన మోసాల మొత్తం
ఆర్బీఐ నివేదిక ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2023-24లో దాదాపు రూ. 12,230 కోట్లుగా ఉన్న మోసాల మొత్తం, ఆర్థిక సంవత్సరం 2024-25లో ఏకంగా రూ. 36,014 కోట్లకు పెరిగింది. అయితే, మోసాల కేసుల సంఖ్య మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. 2023-24లో 36,060 కేసులు నమోదు కాగా, 2024-25లో ఈ సంఖ్య 23,953కి తగ్గింది.
Read Also:Tulsi Benefits : జుట్టు రాలడం తగ్గి..నిగనిగలాడే జుట్టు కావాలంటే తులసితో ఈ టిప్స్ పాటించండి
గత ఆర్థిక సంవత్సరంలో మోసాలలో ఉన్న మొత్తం పెరగడానికి ప్రధాన కారణం.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరాలలో నమోదు చేయబడిన రూ. 18,674 కోట్ల విలువైన 122 కేసులలో మోసం వర్గీకరణను తొలగించడం, అలాగే 2023 మార్చి 27న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి పునఃపరిశీలన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా నమోదు చేయడం.
ఎక్కువ మోసాలు డిజిటల్ చెల్లింపుల్లో, ఎక్కువ మొత్తం రుణాల్లో
ఆర్బీఐ నివేదిక ప్రకారం.. సంఖ్యల పరంగా మోసాలు ఎక్కువగా డిజిటల్ చెల్లింపుల విభాగంలో (కార్డులు, ఇంటర్నెట్) జరిగాయి. అయితే, మోసాల మొత్తం విలువ పరంగా చూస్తే మాత్రం అధిక శాతం లోన్ల విభాగంలోనే నమోదైంది. సంఖ్యల ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం మోసాలలో దాదాపు 60 శాతం ప్రైవేటు రంగ బ్యాంకుల (PSB) వాటా ఉంది. విలువ పరంగా చూస్తే ఈ బ్యాంకుల వాటా 71 శాతం కంటే ఎక్కువ.
Read Also:Deepika Padukone : ఆమె డిమాండ్లలో తప్పేలేదు.. దీపిక పదుకొణేకు మద్దతు పలికిన అజయ్ దేవ్ గన్
ప్రైవేటు రంగ బ్యాంకులదే సింహభాగం
ఆర్బీఐ నివేదికలో పేర్కొన్న ప్రకారం.. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో నమోదైన మోసాల సంఖ్యలో కార్డ్/ఇంటర్నెట్ మోసాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలు ప్రధానంగా రుణాల విభాగంలోనే జరిగాయి. సంఖ్య పరంగా రుణాలకు సంబంధించిన మోసాలు మొత్తం కేసుల్లో 33 శాతం కంటే ఎక్కువ కాగా, విలువ పరంగా 92 శాతం కంటే ఎక్కువ మోసాలకు కారణమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కార్డ్, ఇంటర్నెట్ మోసాల విభాగంలో 13,516 కేసులు నమోదయ్యాయి. ఇది మొత్తం 23,953 మోసాలలో 56.5 శాతం. ఈ నివేదిక బ్యాంకింగ్ రంగంలో మోసాలను అరికట్టడానికి ప్రభుత్వ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, మోసాలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నాయని స్పష్టం చేస్తోంది.
-
UPI : యూపీఐ యూజర్లకు గుడ్న్యూస్.. మోసాలకు చెక్ పెట్టేలా కొత్త సిస్టమ్
-
Digital Payments: డిజిటల్ పేమెంట్స్లో ఇండియా సరికొత్త రికార్డు
-
UPI Payments : UPI ల ద్వారా దుబారా ఖర్చు ఎక్కువ అవుతుందా?
-
Paytm Solar Sound Box: వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇకపై సోలార్తో పేటీఎం సౌండ్ బాక్స్
-
Paytm: పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ దేశాల్లో ఇకపై ఈజీగా చెల్లింపులు