Supreme Court : భారత్ ధర్మశాల కాదు.. ఇప్పటికే 140 కోట్ల మందితో పోరాడుతున్నాం : సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Supreme Court : శరణార్థుల విషయంలో భారత సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “భారత్ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన శరణార్థులకు ధర్మశాల కాదు” అంటూ ఒక శ్రీలంక పౌరుడి శరణార్థి పిటిషన్ను సోమవారం కొట్టివేసింది. ఆ శ్రీలంక వ్యక్తి తన దేశంలో ప్రాణహాని ఉందని పేర్కొంటూ భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. వీసాపై భారతదేశానికి వచ్చిన అతడు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద మూడేళ్లుగా జైలులో ఉన్నాడు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, కె.వినోద్ చంద్రన్ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. “భారత్ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన శరణార్థులను ఉంచడానికి ధర్మశాల కాదు” అని స్పష్టం చేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఆ శ్రీలంక పౌరుడిని 2015లో అరెస్టు చేశారు. ఒకప్పుడు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) శ్రీలంకలో ఉగ్రవాద సంస్థగా ఉండేది.
Read Also:IPL 2025: ప్లే ఆఫ్స్కు చేరిన ఆర్సీబీకి తప్పని భయం.. ఆందోళనలో ఫ్యాన్స్
జస్టిస్ దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. “ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన శరణార్థులకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలా? ఇప్పటికే 140 కోట్ల మందితో పోరాడుతున్నాం. ఇది ప్రతి ఒక్కరినీ ఆహ్వానించడానికి ధర్మశాల కాదు” అని అన్నారు. అతనికి భారతదేశంలో ఉండటానికి ఏమి హక్కు ఉందని కోర్టు ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. అతను శరణార్థి అని, తన దేశంలో అతనికి ప్రాణహాని ఉందని కోర్టుకు తెలిపారు.
శ్రీలంక తమిళుడు వీసాపై భారతదేశానికి వచ్చాడని, అతని భార్య, పిల్లలు ఇక్కడ స్థిరపడ్డారని న్యాయవాది కోర్టుకు వివరించారు. అతను దాదాపు మూడేళ్లుగా నిర్బంధంలో ఉన్నాడని, బహిష్కరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని ఆయన తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 19 లను ఉటంకించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఆర్టికల్ 19 కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని, విదేశీ పౌరులు దాని పరిధిలోకి రారని స్పష్టం చేసింది.
Read Also:AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగస్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్
శ్రీలంక పౌరుడు వేరే దేశంలో ఆశ్రయం పొందడానికి ప్రయత్నించాలని సుప్రీంకోర్టు సూచించింది. 2018లో ఒక ట్రయల్ కోర్టు అతడిని UAPA కింద దోషిగా నిర్ధారించి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో మద్రాస్ హైకోర్టు ఆ శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. అంతేకాకుండా, శిక్ష పూర్తయిన వెంటనే దేశం విడిచి వెళ్లాలని, బహిష్కరణకు ముందు శరణార్థి శిబిరంలో ఉండాలని ఆదేశించింది.
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Starlink : భారతదేశంలో ఏ మారుమూలన ఉన్నా.. సిగ్నల్స్ లేకున్నా హై స్పీడ్ ఇంటర్నెట్
-
Cab Charges : ప్రయాణికులకు షాక్.. భారీగా పెరగనున్న క్యాబ్ ఛార్జీలు.. కొత్త నిబంధనలు ఇవే!