IPL 2025 Final: రిజర్డ్వ్ డే రోజు వర్షం పడితే.. విన్నర్ ఇక ఆ జట్టే!
IPL 2025 Final: ఐపీఎల్ ముందుస్తు షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో జరగాలి. కానీ దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో అక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

IPL 2025 Final: ఐపీఎల్ 2025 తుది దశకు చేరుకుంది. ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈసారి ఐపీఎల్ ఫైనల్ చాలా స్పెషల్. ఎందుకమటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటిదాకా ఒక్కసారిగా కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోలేకపోయాయి. అందుకే ఈ మ్యాచ్ లో ఏ టీమ్ గెలిచిన అది వాళ్లకు పండగే.
వర్షం పడే ఛాన్స్ ?
అహ్మదాబాద్ వేదికగా మంగళవారం రాత్రి 7.30 PM గంటలకు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది. బీసీసీఐ సైతం మ్యాచ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే ముగింపు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. త్రివిధ దళాల అధిపతులు కూడా ఈ వేడుకలకు రానున్నారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలగించే ప్రమాదం ఉందని అహ్మదాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు (మంగళవారం) అహ్మదాబాద్ లో ఆకాశం మేఘాలు కమ్ముకనే ఛాన్స్ ఉందని తెలిపింది. సమీప ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో కంగారు పడుతున్నారు.
ఐపీఎల్ ముందుస్తు షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో జరగాలి. కానీ దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో అక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అందుకే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ల వేదికను అహ్మదాబాద్కు మార్చారు. క్వాలిఫయర్ -2లో ముంబై, పంజాబ్ మ్యాచ్ జరిగినప్పుడు వర్షం అడ్డుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు మ్యాచ్ను రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది.
Also Read: Bad news for RCB fans: ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్కు వరుణుడి ముప్పు
మ్యాచ్ రద్దు అయితే ?
ఆర్సీబీ, పంజాబ్ ఫైనల్ మ్యా్చ్ ప్రారంభమైనప్పుడు ఒకవేళ వర్షం పడితే.. గంటన్నర అదనపు సమయం లోగా పూర్తిగా తగ్గితే 20 ఓవర్లలో మ్యాచ్ జరిపిస్తారు. గంటన్నర కంటే ఎక్కువ సమయం వర్షం అంతరాయం ఏర్పడితే ఓవర్లను కుదిస్తారు. మ్యాచ్ నిర్వహించడం కుదరకపోతే రిజర్వ్ డే ఉంటుంది. అంటే మంగళవాం భారీ వర్షం కురిసి మ్యాచ్ సాధ్యం కాకపోతే మరుసటి రోజు (బుధవారం) నిర్వహిస్తారు.
రిజర్వ్ డే రోజు వర్షం పడితే
రిజర్వ్ డే రోజు కూడా ఒకవేళ వర్షం పడితే ఎలా అని చాలామందికి సందేహం ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు లీగ్ స్టేజ్లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న టీమ్ను విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడు పాయింట్ల పట్టికను గమనిస్తే పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్లు ఆడి అందులో 9 గెలిచింది. ఇప్పుడు ఆ జట్టు 19 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంది. ఒకవేళ రిజర్వ్ డే రోజున వర్షం పడి మ్యా్చ్ రద్దయితే పంజాబ్ జట్టుకే ఐపీఎల్ ట్రోఫీ దక్కుతుంది.
Also Read: IPL 2025 final, RCB vs PBKS: నేడే తుది సమరం.. ఏ జట్టు గెలిచినా చరిత్రే
ఒకవేళ మ్యాచ్ టై అయితే ?
మ్యాచ్ టై అయినప్పుడు ఎప్పట్లాగే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్లో కూడా టై అయితే ఫలితం వచ్చేవరకు సూపర్ ఓవర్లు ఆడిస్తారు. అందులో గెలిచిన టీమ్ను విజేతగా ప్రకటిస్తారు. అయితే ఈసారి ఫైనల్ మ్యాచ్లో తలపడనున్న ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్ను కొట్టలేకపోయాయి. దీంతో ఓవైపు పంజాబ్ కింగ్స్ టీమ్ అభిమానులు.. మరోవైపు ఆర్సీబీ అభిమానులు తమ జట్టే గెలవాలని కోరుకుంటున్నారు.
-
Anushka Sharma: ఐపీఎల్ ఫైనల్లో అనుష్క శర్మ ధరించిన కాస్ట్లీ ప్రొడక్ట్స్
-
IPL 2025: ఆర్సీబీ విజయానికి కలిసొచ్చిన ఆపరేషన్ సింధూర్
-
Virat Kohli Sensational Comments Rohit: రోహిత్పై కోహ్లీ సంచలన కామెంట్స్.. ఇంపాక్ట్ చూపించడం లేదంటూ..?
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
-
Bad news for RCB fans: ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్కు వరుణుడి ముప్పు
-
IPL 2025 final, RCB vs PBKS: నేడే తుది సమరం.. ఏ జట్టు గెలిచినా చరిత్రే